కరోనా వైరస్పై ఐక్య పోరాటానికి కలిసి రావాలని సార్క్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన భూభాగం కరోనా వైరస్తో పోరాటం చేస్తుందన్న మోదీ.. దీన్ని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా పని చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ జనాభాలో అత్యధికంగా జనాభా ఉన్న దక్షిణాసియాలో ఈ వైరస్ను అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్పై పోరాటం చేసేందుకు ఒక బలమైన వ్యూహాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నానని మోదీ అన్నారు. మన పౌరుల ఆరోగ్యం గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిద్దామని మోదీ ప్రతిపాదన చేశారు.
కరోనా కలవరం.. సార్క్ దేశాలకు మోదీ పిలుపు